YS. జగన్, చంద్రబాబుని ఫాలో అవుతున్నాడు ఏంటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన హామీల లో ఒకటి అయిన మద్యపాన నిషేధం గురించి చెప్తూ ఒకేసారి మద్యపానం నిషేధం చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, కావున దశలవారీగా మద్యపానం నిషేధం జరుగుతుంది. 2024 నాటికి పూర్తిగా మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తానని ఆయన తెలిపారు.

ఇకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొదటి కోరిక అయినటువంటి ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి 250 సీట్లు రాకూడదు అని దేవుడిని చాలా ప్రార్థించాను కానీ అంతకన్నా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు మోడీకి క్లియర్ మెజారిటీ ఉంది. కాబట్టి మనం ఇంక కేంద్రంతో గొడవ పడలేం అని చెప్పి ఆంధ్ర ప్రజలకు షాక్ ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి.

గత 5 సంవత్సరాలలో కూడా మోడీకి క్లియర్ మెజారిటీ ఉందిగా.. ఎన్నికల ప్రచారంలో నాకు 25 ఎం.పీలు ఇస్తే ప్రతేక హోదా తెచ్చేత్తా అని చెప్పిన మీకు.. అప్పుడు తెలీలేదా.. మోడీకి క్లియర్ మెజారిటీ ఉందని.. జగన్ రెడ్డి గారు..

బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం అడిగితే ఇవ్వలేదు సారూ ఎన్నో పోరాటాలు చేస్తే గతిలేక ఇచ్చారు భారత్ దేశాన్ని,,, మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పోరాడాలి కానీ ఎన్ని సార్లు అయినా ఢిల్లీ కి వెళ్తాను ఈ మాటలు ఏంటండీ ,మీరు కూడా చంద్రబాబు లాగే ‘U’ టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ,ఇందుకేనా ప్రజలు మీకు ఇన్ని సీట్లు ఇచ్చి గెలిపించింది , ఆంధ్ర ప్రజలు మీ నుండి ఇలాంటి ఆన్సర్స్ కోరుకోవడం లేదు సార్ మన ఆంధ్ర ప్రజలు బాగుండడం కోసం ప్రతేక హోదా కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *