పవన్ కళ్యాణ్ క్షుద్ర పూజ అంటూ తప్పుడు పోస్ట్ లపై జనసైనికుల పోలీస్ పిర్యాదు
ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో దేవలయాలపై జరుగుతున్న దాడులు అందరిని కలిచి వేస్తున్నాయి, అంతర్వేది లో రథం కి నిప్పు అంటించిన ఘటనపై జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దైని శైలి లో స్పందించారు, అలాగే రథం దగ్ధం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా, లేక ఆకతాయిలు చేసిన పనినా అని సమగ్ర విచారణ చేయాలి అని అలాగే కేసుపై సీబీఐ ఎంక్విరీ వెయ్యాలి అంటూ, అలాగే లౌకికవాదం గురించి చెప్పొకొచ్చారు,
ఇలాంటి ఘటనలపై నిరసిస్తూ అందరు దీపారాధన చేయాలి అంటూ పిలునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే దీపం వెలిగించి ఫోటోను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు, రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది.
కాకపోతే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను క్షుద్రపూజలు చేస్తున్నట్టు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు, దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జనసేన శ్రేణులు, తమ నాయకుడి గురించి తప్పుడు రాతలు రాసి ప్రజల్లో తప్పుడు సందేశాలు ఇచ్చేలా చేస్తున్నారు అంటూ కంప్లైంట్ లో పేర్కొన్నారు, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కేస్ నమోదు చేశారు రాజలింగం గారు ( జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు)