మహాత్మాగాంధీ జీవిత చరిత్ర – Mahatma Gandhi History in Telugu
మహాత్మాగాంధీ జీవిత చరిత్ర
- 1869 అక్టోబర్ 2న ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు.
- తండ్రి: కరమ్ చంద్ గాంధీ
- తల్లి: పుతిలిబాయి
- 1881: కస్తూర్బాతో వివాహం .
- 1888: ఇంగ్లాండ్ వెళ్లాడు.
- 1894: దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా పట్టణంలో ముస్లిం వ్యాపారవేత్త. కేసు వాదించటానికి న్యాయవాదిగా వెళ్లాడు.
- 1894-1911: భారతీయ వలసదారుల హక్కుల కోసం దక్షిణాఫ్రికాలో ఉద్యమం చేసాడు.
- 1914: మొదటి ప్రపంచ యుద్ధంలో అస్వస్థతతో మరియు గాయపడిన వారికి సహాయపడినందుకు బంగారు బహుమతితోపాటు “కైసర్-హి-హింద్” అనే అవార్డును ప్రదానం చేశారు.
- 1915 జనవరి 9: భారత్ తిరుగు ప్రయాణం, సబర్మతిలో ఆశ్రమం ఏర్పాటు.
- 1919 మార్చి 18: రౌలత్ చట్టంనకు వ్యతిరేకంగా ఉద్యమం.
- 1919 ఏప్రిల్ 13: కైసర్-హి-హింద్ బంగారు బహుమతి వాపసు.
- 1920: సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం.
- 1922: చౌరి చౌరా (ఉత్తరప్రదేశ్) సంఘటనకు బాధ్యత వహించి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాడు.
- 1924: కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించాడు.
- 1924-27: రాజకీయల నుండి తప్పుకొని (ఎ) అస్పృశ్యత నిర్మూలన కోసం కృషి (బి) హిందూ-ముస్లిం ఐక్యత కోసం కృషి
- 1928: బార్డోలి సత్యాగ్రహం.
- 1929: శాసనోల్లంఘన ఉద్యమం కోసం జాతీయ కాంగ్రెస్ అనుమతి.
- 1930: దండిమార్చ్ (మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు)
- 1931: గాంధీజీ-లార్డ్ ఇర్విన్ మధ్య ఒప్పందం, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో (లండన్) పాల్గొన్నాడు.
- 1982: సెప్టెంబర్ 20: కమ్యూనల్ అవార్డుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం,
- 1932 సెప్టెంబర్: పూనా ఒప్పందం (గాంధీ-అంబేద్కర్ల మధ్య) హరిజన్ (వారపత్రిక) ప్రారంభం.
- 1933: అంతఃశుద్ధి కోసం వ్యక్తిగత సత్యాగ్రహం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
- 1984-88: నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించాడు. వార్తాలో సేవాగ్రమ్ ఏర్పాటు.
- 1939: క్రియాశీల రాజకీయాలకు పునరాగమనం.
- 1940: కొంతకాలం కాంగ్రెస్ కార్యక్రమాలకు నాయకత్వం.
- 1942: డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) అనే నినాదంతో బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానం.
- 1944 అగాఖాన్ ప్యాలెస్లో నిర్బంధంలో ఉన్న సందర్భంలో తన భార్య అయిన కస్తూర్బాను శాశ్వతంగా కోల్పోయాడు.
- 1948, జనవరి 30: నాథూరామ్ గాడ్సే చేత హత్య చేయబడ్డాడు.